

ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) ఉపాధ్యక్షుడిగా పారిశ్రామిక వేత్త, సేవా మూర్తి బండారు నరసింహారావు
విజయవాడ: పరిశ్రమలలో విశేష అనుభవం కలిగిన పారిశ్రామిక వేత్త, సేవా మూర్తి బండారు నరసింహారావు ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు దేశంలోని పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో అనుబంధంగా కొనసాగుతూ, డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన జనసేన అగ్రనేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 17 September, 2025 బుధవారం వర్చువల్ మాధ్యమంలో జరిగిన ACA సాధారణ సమావేశంలో నరసింహారావును ఉపాధ్యక్షుడిగా…

వికారాబాద్ జిల్లాలో ఉత్తరప్రదేశ్కు చెందిన అధికారుల పర్యటన
గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ పురోగతి అభివృద్ధి చెందినట్లుగా అవుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. గత రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ విభాగ ప్రజాప్రతినిధులు, ఆ రాష్ట్ర అధికారులు జిల్లాలోని పలు గ్రామపంచాయతీల పనితీరును పరిశీలించారు. ఈ మేరకు 28 మందితో కూడిన బృందం జిల్లాలోని పూలుముర్ది, లింగంపల్లి, నవాబ్పేట్ పరిధిలోని గ్రామ పంచాయతీలను పరిశీలించారు. గ్రామంలో ఉన్న క్లీన్ అండ్ గ్రీన్,…

దసరా ఉత్సవాలకు 4,500 మందితో పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు 4,500 మందితో పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వి.అనిత తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈసారి దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వెయ్యి కి పైగా సిసి…

వృద్ధాశ్రమంలో సేవామూర్తి లయన్ డా॥ నిమ్మల స్వామినాయుడు జన్మదిన వేడుక
సెప్టెంబర్ 17, వైరల్ తెలుగు : ఆరోగ్య రంగంలో సంపాదన కంటే సేవకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ… సుదీర్ఘ కాలంగా ఎన్నో రక్తదాన మరియు వైద్య శిబిరాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న మెడికల్ ప్రాక్టీషనర్ లయన్ డా॥ నిమ్మల స్వామినాయుడు(72) జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నోబెల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నల్ల రామచందర్, ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ జనార్థన్, కోశాధికారి తాటి శ్రీనివాసరావు, లియో కో`ఆర్డినేటర్ జనపరెడ్డి రవీందర్లు పాల్గొని డా॥…

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వంలోకి ముగ్గురు కొత్త మంత్రులు
నేపాల్లో అల్లర్లు, హింస తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కర్కీ కేబినెట్ విస్తరణ చేశారు. కేబినెట్లోకి కొత్తగా ముగ్గురు మంత్రులను తీసుకున్నారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి సహా నలుగురు సభ్యులు ఉన్నారు. ఖాట్మాండులోని రాష్ట్రపతి భవన్లో సీతల్ నివాస్లో కుల్మాన్ ఘిసింగ్, ఓం ప్రకాష్ ఆర్యల్, రామేశ్వర్ ఖనాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి, వివిధ వర్గాలలో విశ్వాసం నింపడానికి…

నేడు ఇంజనీర్ల దినోత్సవం
ప్రతి ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్ల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇండియాలో ఇంజనీర్ల దినోత్సవం జరుపుతున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహించారు. విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మైసూర్ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో…

బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని.. నిరాధారమైనవని.. అవి తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ కేటీఆర్ పిటిషన్ వేశారు. తనకు బహిరంగ క్షమాపణతో పాటు రూ.10 కోట్లు చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి…

పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందతుడు 21 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నల్గొండ పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి ఆదేశించింది. 2018 ఫిబ్రవరిలో ఎనిమిదేళ్ల బాలికపై నిందతుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది అతడిపై చిట్యాల పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే 2022…

నాలాల కబ్జాల వల్లే వరదల సమయంలో విపత్తులు: హైడ్రా కమిషనర్
హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆఫ్జల్ సాగర్లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు వరద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్లోని అఫ్జల్ సాగర్ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫ్జల్ సాగర్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పరిస్థితిని…

హిందీ భాష భారత సంస్కృతికి ప్రతిరూపం: బండి సంజయ్
హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ‘హిందీ దివస్’ను పురస్కరించుకుని ఈరోజు గుజరాత్లోని అహ్మదాబాద్లో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర న్యాయ రాష్ట్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్,…
- 1
- 2